Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : *మహబుబ్ నగర్ జిల్లా భూత్పురు మండలం చౌలతండా లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి* *ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు* *మొదట సంత్ సేవాలాల్ మహరాజ్ గారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యక్రమం ప్రారంభించారు* ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ లో గిరిజనులు ఆత్మగౌరవం తో జీవిస్తున్నారు అని అన్నారు *అపన్ తండేమా-అపన్ రాజ్* అన్న వారి ఆకాంక్ష నెరవేరింది దేవరకద్ర నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో పెద్ద తాండలను అన్నిటినీ కూడా గ్రామ పంచాయతీలు మార్చుకున్నామన్నారు, ఇప్పుడు తండాలాకు ప్రత్యేక నిధులు వస్తున్నాయి అక్కడ ఉన్న గిరిజనులే సర్పంచులుగా ఎన్నుకోబడి తండాలాకు ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసుకుంటున్నారు పల్లెలకు,పట్టణాలకు దూరంగా ఉన్న గుడాలు,తాండలు గ్రామ పంచాయతీలు మరాయన్నారు భూత్పురు మున్సిపల్ పరిధిలోని అన్ని తండాలకు బిటి రోడ్లు మంజూరు చేసుకున్నామని వాటి నిర్మాణం కొనసాగుతుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు
Admin
Abhi9 News