Saturday, 18 April 2026 03:30:08 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా

జిల్లా కేంద్రం లో ప్రభుత్వ బి.సి బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా

Date : 05 March 2026 06:21 AM Views : 78

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మెనూ పక్కాగా అమలు చేస్తూ విద్యార్థిని లకు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ బంగ్లా సమీపంలో ఉన్న ప్రభుత్వ బి.సి. బాలికల సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వసతిగృహంలో భోజనం మెనూ ప్రకారం అందించాలని, అలాగే వసతిగృహంలో పరిశుభ్రతను పాటించాలని అధికారులకు సూచించారు. తనిఖీలో భాగంగా కలెక్టర్ వసతి గృహంలోని కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, డార్మిటరీ గదులు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారికి డైట్ ప్రకారం రుచికరమైన, పోషకాహారం అందుతున్నదా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థుల సంఖ్య, గదుల సంఖ్య, విద్యార్థులు ఎలా చదువుతున్నారు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, ప్రస్తుతం వసతి గృహంలో సుమారు 250 మంది బాలికలు నివసిస్తున్నామని, అయితే డార్మిటరీ గదులు తగినంతగా లేవని తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ పంచాయతీ రాజ్ ఈ ఈ కి పరిశీలించేందుకు తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని, తాగునీటిలో పి.పి.ఎం శాతాన్ని తరచూ పరీక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. టెన్త్ క్లాస్ చదువుతున్న ఒక విద్యార్థిని మాట్లాడుతూ, తాము మార్కెట్ రోడ్ పాఠశాలలో చదువుతున్నామని, తెలుగు, హిందీ, బయో సైన్స్ ఉపాధ్యాయుల కొరత ఉందని తెలిపారు. ఈ విషయంపై కూడా సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడతానని కలెక్టర్ తెలిపారు.అదనంగా, వసతి గృహంలోని బోర్‌వెల్ మరమ్మతులు, సీసీ కెమెరాల వ్యవస్థ, సిబ్బంది పనితీరు తదితర అంశాలపై కూడా కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, డైట్ మెనూను కచ్చితంగా అమలు చేయాలని, సమయపాలన పాటించాలని, వసతి గృహంలో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి ఆదేశించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :