Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎబివిపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు... ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు... రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేట్ కళాశాలలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన చదువు చెప్పకుండా విద్యను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు...
Admin
Abhi9 News