Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కేంద్రంలో ఆరు టిప్పర్లను దేవరకద్ర ఎమ్మార్వో జ్యోతి పట్టుకున్నారు మాగనూరు నుండి మహబూబ్ నగర్ కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను పట్టుకొని ఎమ్మార్వో కార్యాలయం ముందు నిలిపివేశారు. అయితే కాసేపటికి జిల్లా కేంద్రం నుంచి ఒకరు వచ్చి తమకు పర్మిషన్లు ఉన్నాయంటూ వాహనాలు అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి . టిప్పర్లను పట్టుకొని వదిలేయడం ఏంటి అని మొదట చెక్ చేయలేదా లేక అధికారులు ఏమన్నా లొంగిపోయారా అన్న అనుమానాలకు తావిస్తోందని స్థానికులు చెపుతున్నారు.దీనిపై తాసిల్దార్ జ్యోతి నీ మీడియా వివరణ కోరగా ఆమె స్పందిస్తూ ఒక్కో లారీకి 25000 ఫైన్ వేశానని చెబుతుంది.
Admin
Abhi9 News