Thursday, 08 January 2026 03:10:05 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన మేఘాలయ అసెంబ్లీ సభ్యుల బృందం

Date : 08 July 2025 07:40 PM Views : 103

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మేఘాలయ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మరియు ఎమ్మెల్యేల బృందం మంగళవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ని సందర్శించారు. హైదరాబాద్ లోని అసెంబ్లీ కమిటీ హాల్ లో మేఘాలయ రాష్ట్ర బృందానికి పిఎసి చైర్మన్ శ్రీ ఆర్కేపూడి గాంధీ గారితో కలిసి గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు స్వాగతం పలికారు. అనంతరం వారితో సమావేశమై తెలంగాణ , రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల గురించి సభ్యులకు వివరించారు. అసెంబ్లీ నిర్వహించే విధానంతో పాటు, అసెంబ్లీ లో ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి చేసే చట్టాలను మరియు రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలను , రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వారికి గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ప్రత్యేక రాష్ట్రం ఉద్దేశ్యాలను, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఔన్నత్యం గురించి మేఘాలయ అసెంబ్లీ సభ్యుల బృందానికి ఆయన వివరించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో "విద్యా నిధి" ఏర్పాటు , మహబూబ్ నగర్ ఫస్ట్ లక్ష్యాలను, నిరుద్యోగ యువతకు ఇచ్చే ఉచిత కోచింగ్, నైపుణ్య శిక్షణ సెంటర్ గురించి కూడా వారికి వివరించారు. ఈ సందర్భంగా మేఘాలయ అసెంబ్లీ సభ్యుల బృందం అసెంబ్లీ సమావేశాల గురించి, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి , మహబూబ్ నగర్ విద్యా నిధి గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేఘాలయ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శ్రీ చార్లెస్ పిన్గ్రోప్, ఎమ్మెల్యేలు శ్రీ లహ్క్మెన్ రింబుల్, శ్రీ రూపా M. మార్క్, మరియు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి నర్సింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :