Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని బిజెపి రాష్ట్ర పిలుపు మేరకు నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో డబల్ బెడ్ రూమ్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్ ఆచారి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలైనా నేటికీ నియోజకవర్గంలో పేదవారికి ఒక డబల్ బెడ్ రూమ్ ఇ వ్వలేదని ప్రభుత్వన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం పేదల కు డబుల్ బెడ్ రూమ్ ల పై నిర్లక్ష్యం చేస్తుందని ప్రభుత్వ కార్యాలయం ప్రారంభించుకోవడానికి వాళ్ళ పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడానికి సమయం దొరుకుతాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం పేదల కొరకు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుందని అందులో భాగంగా కూడా పేదలకు డబుల్ బెడ్ రూమ్ నిధులు కేటాయిస్తే అది చిన్నగా ఉన్నాయని అవి సరిపోవని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు డబల్ బెడ్ రూమ్ పంచుతా అని చెప్పి నేటికీ పంచకపోవడం పేదలని నిర్లక్ష్యం చేస్తుంటే అని ఆయన తీవ్రంగా విమర్శించారు. కారణం పేదలను చిన్నచూపు చూడమని ప్రశ్నించే గొంతును పోలీసులతో అంచివేస్తున్నారని దిలీపాచారి వెల్లడించారు. భాగంగా ఈరోజు నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి గతంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు కలెక్టర్ మెమొరన్ ఇచ్చామని ఇంతవరకు పట్టించుకోలేదని ఇక్కడి నాయకులు ఎమ్మెల్యే . ఎంపీ .ఎమ్మెల్సీ ఇతర నాయకులందరూ ఉన్న ఒక్కరోజు కూడా డబల్ బెడ్ రూమ్ లో కట్టినవి ఎందుకు పంచ లేకపోయారని విమర్శించారు కలెక్టర్ కార్యాలయం ప్రారంభించే ముందు మేము ప్రశ్నిస్తామని పోలీస్ ద్వారా అరెస్టు చేయించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అచ్చంపేట ఇంచార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సతీష్ మాదిగ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరి నాయకులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News