Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్బంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం కమ్మదనం గ్రామంలో పోలింగ్ బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో అమ్మకు వందనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణమ్మ, జిల్లా అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ పాల్గొనడం జరిగింది. కమ్మధనం గ్రామం ముఖ్య కూడలిలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్ర పటానికి అరుణమ్మ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అమ్మకు వందనం కార్యక్రమంలో భాగంగా కమ్మదనం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఎంపీ అరుణమ్మ మొక్కలు నాటడం జరిగింది. అరుణమ్మ మాట్లాడుతూ.. అమ్మకు వందనం కార్యక్రమం లో భాగంగా కమ్మధనం గ్రామంలో 2 వేల మొక్కలు నాటడం చాలా అభినందించవలసిన విషయం ముఖ్యంగా సీనియర్ నాయకులు సన్గోముల శ్యామ్ సుందర్ రెడ్డి గ్రామ బిజెపి నాయకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలపడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్ లో వంద మొక్కలు నాటడం జరుగుతుంది అని అన్నారు. గ్రామంలోని మహిళలు వారి సమస్యలు ఎంపీ గారితో వివరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీ ని నెరవేర్చాలని అన్నారు. రాజ్ భూపాల్ గౌడ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటుతున్నామని నాటిన మొక్కలను విధిగా సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనదే అని అన్నారు ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పర్యావరణ పరిరక్షణ ఇంచార్జి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య, బిజెపి సీనియర్ నాయకులు చెంది మహేందర్ రెడ్డి, దేపల్లి అశోక్ గౌడ్,మోహన్ సింగ్, విజయ్ బాస్కర్, ఇస్నాతి శ్రీనివాస్, చేగు సుధాకర్ అప్ప,చెట్ల వెంకటేష్, వంశీకృష్ణ, ప్యాట అశోక్, రంగన్న గౌడ్, లష్కర్ నాయక్, అనిల్ గౌడ్, శ్రీరామ్ రెడ్డి,తదితరులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు..
Admin
Abhi9 News