Thursday, 08 January 2026 02:38:17 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

తెలంగాణలో మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు కలకలం

Date : 21 June 2023 07:47 PM Views : 293

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణలో మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 16 ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మొన్నటి దాకా బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయగా.. తాజాగా ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య కళాశాలలు.. వాటి యాజమాన్యాలపై ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫిల్మ్‌నగర్‌లోని ప్రతిమ గ్రూప్స్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో ఈడీ తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాలోని ప్రతిమ వైద్య కళాశాలలు, చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలల్లో తనిఖీలు ప్రతిమ కళాశాలతో పాటు ప్రతిమ మల్టీప్లెక్స్‌లో తనిఖీలు నిర్వహించారు. అలాగే కళాశాల యాజమాన్యం ఆఫీసు, ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా మహబూబ్​నగర్​లోని ఎస్‌వీఎస్, ఎల్బీనగర్‌లోని కామినేని వైద్య కళాశాల, ఇంకా ఇతర కళాశాలల్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఎంఎన్‌ఆర్‌ వైద్య కళాశాలలో అక్రమాలపై ఈడీ తనిఖీలు నిర్వహించింది. కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు.. గతేడాది ఏప్రిల్‌లో వరంగల్‌లో పీజీ మెడికల్‌ సీట్లు అక్రమంగా బ్లాక్‌ చేశారని కేసును పోలీసులు నమోదు చేశారు. నమోదు వరంగల్‌ పోలీసులు కేసు ఆధారంగా మనీలాండరింగ్‌ దర్యాప్తును ఈడీ చేస్తుంది. పది ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు 45 సీట్లు బ్లాక్‌ చేసి.. ఆ తర్వాత వాటిని అమ్ముకున్నారని అభియోగం మోపారు. తొమ్మిది ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :