Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గతంలో విధులు నిర్వహించి ప్రస్తుతం మేడ్చల్ వైద్య ఆరోగ్య శాఖలో జిల్లా మాస్ మీడియా అధికారిగా పనిచేస్తున్న వేణుగోపాల్ రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఇవాళ తెల్లవారుజామున పాండిచ్చెరీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేణుగోపాల్ రెడ్డి మృతి చెందారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సమయంలో తనదైన ముద్ర వేసిన వేణుగోపాల్ రెడ్డి సేవలు వెలకట్టలేనివని మంత్రి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.
Admin
Abhi9 News