Saturday, 18 April 2026 06:46:42 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

జిల్లాలోని ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లను ప్రారంభించాలి- జిల్లా కలెక్టర్ జి.రవినాయక్

Date : 25 July 2023 07:02 PM Views : 224

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ, మంచి నడవడిక అలవడితే జీవితంలో క్రమశిక్షణతో పాటు ,మంచి మూర్తి మత్వం కలిగిన పౌరులు తయారవుతారని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యాలయంలో నూతనంగా ఎంపికైన కార్యవర్గ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, వ్యక్తిగత మూర్తిమత్వాన్ని పెంపొందించుకునేందుకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సాధనంగా ఉపయోగపడుతుందని అన్నారు. అందువల్ల ప్రతి పాఠశాలలో స్కౌంట్స్అండ్ గైడ్స్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ విషయంపై తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు. స్కౌట్స్, గైడ్స్ భవన అభివృద్ధికి తన వంతుసహాయ సహకారాలు అందిస్థానన్నారు.స్కౌట్స్ గైడ్స్ పై శిక్షణ ఇచ్చేందుకు శిక్షణ శిబిరాల ఏర్పాటుకు లక్ష రూపాయలు మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అంతేగాక స్కాట్స్ అండ్ గైడ్స్ భవనంప్రధాన రహదారి వైపు ప్రహరీ నిర్మాణానికి నిధుల మంజురుకు సహకారం అందిస్తామని తెలిపారు . కాగా జిల్లా అసోసియేషన్ అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్, సెక్రటరీగా జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ ,ఉపాధ్యక్షులుగా మల్లారెడ్డి, బెక్కరి రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ,వీణ శివకుమార్, ట్రెజరర్ గా ధనుంజయ రెడ్డి ,ట్రైనింగ్ కమిషనర్ గా జె. హనుమంతు ,విజయలక్ష్మి, జాయింట్ సెక్రెటరీగా స్వరూప రాణిలు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ ఎం రాజా గోపాల్,చీఫ్ కమిషనర్ ఎస్.మల్లారెడ్డి ,ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు నటరాజ్, స్కౌట్స్ గైడ్స్ ఉపాధ్యక్షులు అల్లా రెడ్డి,బెక్కరి రామిరెడ్డి ,స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ ,ఎన్నికల అబ్జర్వర్గా వచ్చిన పరమేశ్వర్ తదితరులు హాజరయ్యారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :