Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : నిరుపేదలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నియోజకవర్గం పరిధిలోని 9 మందికి రూ.5,37,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందచేశారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా సహకారం అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. త్వరలో ప్రారంభమయ్యే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా స్థానికంగానే అన్ని రకాల రోగాలకు వైద్యం అందిస్తామన్నారు.
Admin
Abhi9 News