Thursday, 08 January 2026 02:46:11 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

భారీ వర్షానికి తెగిన కొల్లాపూర్‌ రోడ్డు

శ్రీరంగాపురం మీదుగా వాహనాల మళ్లింపు

Date : 13 September 2025 12:32 PM Views : 81

Abhi9 News - తెలంగాణ / Hyderabad : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెబ్బేరు నుంచి కొల్లాపూర్‌ వెళ్లే ప్రధాన రహదారి తెగిపోయింది. శేరిపల్లె సమీపంలో వాగుపై కొత్త వంతెన నిర్మిస్తున్నందున పక్కనే తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. ఇటు వంతెన నిర్మాణం మధ్యలో ఆగిపోవడం, అటు తాత్కాలిక రోడ్డు నిర్వహణను పట్టించుకోకపోవడం వల్ల శుక్రవారం నీటి ప్రవాహానికి అది తెగిపోయింది. అదే సమయంలో కొల్లాపూర్‌ నుంచి పెబ్బేరుకు వస్తున్న ఒక భారీ ట్రక్కు దాంట్లో దిగబడిపోయింది. దీంతో జేసీబీ సాయంతో నానా తం టాలు పడి దాన్ని పక్కకు తొలగించారు. రోడ్డు తెగిపోయి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం కొనసాగుతున్నందున వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పెబ్బేరు-కొల్లాపూర్‌ మధ్య ఇది ప్రధాన రహదారి కా వడం, రోజూ వందలాది వాహనాలు తిరుగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాసీల్దార్‌ మురళి, ఎస్సై యుగంధర్‌రెడ్డి అక్కడికి చేరుకొని రోడ్డుకు ఇరువైపులా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనాలను శ్రీరంగాపురం మీదుగా మళ్లించారు. నిలిచిపోయిన ఈ రోడ్డు వంతెన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ వంతెన వద్ద రాస్తారోకో చేసి ప్రభుత్వ దృష్టికి తెచ్చినప్పటికీ ఇంత వరకు స్పందన లేదు.

Also Read : భారీ వర్షానికి తెగిన కొల్లాపూర్‌ రోడ్డు

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :