Tuesday, 06 January 2026 09:14:52 PM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

యూరియా గోస

ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా గోస తీరడం లేదు. బ్యాగుల కోసం రైతులు నిత్యం పీఏసీసీఎస్‌, ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ప

Date : 25 September 2025 09:15 AM Views : 83

Abhi9 News - తెలంగాణ / Hyderabad : ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా గోస తీరడం లేదు. బ్యాగుల కోసం రైతులు నిత్యం పీఏసీసీఎస్‌, ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. అయినా సరిపడా బ్యాగులు అందక నిరాశ చెందుతున్నారు. దీంతో పలు చోట్ల రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ పీఏసీసీఎస్‌లో అధికారులను ఉంచిన రైతులు బయటి నుంచి తాళం వేశారు. సిబ్బంది టోకెన్లు అందించినా.. యూరియా అయిపోయిందని చె ప్పడంతో కన్నెర్ర చేశారు. స్టాక్‌ లేనప్పుడు టోకెన్లు ఎందుకు ఇచ్చారని అధికారులను నిలదీశారు. వారం రోజులుగా తిరుగుతున్నా.. స్టాక్‌ లేదని అధికారులు చెబుతున్నారని దుమ్మెత్తిపోశారు. పోలీసులు అక్కడకు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. అలాగే నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలోని మన గ్రోమోర్‌ సెంటర్‌ వద్ద తెల్లవారుజామునే.. ఊర్కొండ రైతు ఆగ్రోస్‌ సెంటర్‌ వద్ద కర్షకులు ఎదురుచూపులు తప్పలేదు. మహబూబ్‌నగర్‌ జిల్లా మూ సాపేట మండలం జానంపేటలో యూరి యా వచ్చిందని తెలుసుకొన్న రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ముందుగా టోకెన్లు పంపిణీ చేయడంతో అందుకునేందుకు ఎగబడ్డారు. దేవరకద్రలోనూ రైతులు తెల్లవారుజాము నుంచే నిరీక్షించారు. జడ్చర్లలోని ఎరువుల విక్రయ దుకాణాల వద్ద అన్నదాతలు క్యూకట్టారు. హన్వాడలోని పీఏసీసీఎస్‌ వద్ద వేకువజామున 4 గంటలకే రైతుల బారులు కనిపించాయి.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :