Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ అవరణలో మంచి నీళ్ళ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి లో గతంలో మంచినీటి సమస్య బాగా ఉండేదని ప్రతి సంవత్సరం నీళ్లను ట్యాంకర్ల ద్వారా తరలించేందుకు ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయల వ్యయం అయ్యేదని ఇప్పుడు అలాంటి సమస్యలు లేవని కల్వకుర్తిలో 65 కోట్లతో ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ శుద్ధి కేంద్రం ద్వారా కల్వకుర్తి లోని ప్రజలకు చుట్టుపక్కల గ్రామాలకు ఎలాంటి నీటి సమస్యలు లేకుండా శుద్ధమైన నీటిని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి యావత్ తెలంగాణ ప్రజల తరఫున కల్వకుర్తి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Abhi9 News