Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : తెలంగాణ రాష్ట్రంలో సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో పాత పెన్షన్ సాధన సంకల్ప రథ యాత్ర ఈరోజు నాగర్ కర్నూల్ కు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ నుండి ఉద్యోగులు బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ లో ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ. ఈనెల 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఈ యాత్ర రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొనసాగుతుందని తెలిపారు . పలు రాష్ట్రాలలో సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత విధానాన్నే కొనసాగిస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మా న్యాయ బద్దమైన డిమాండ్ ను పరిష్కరించాలని అన్నారు. లేని పక్షంలో ఈ ఉద్యమం రాష్ట్రంలో మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.
Admin
Abhi9 News