Tuesday, 06 January 2026 09:14:54 PM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ పట్టణ మాజీ కౌన్సిలర్ ల విలేకరుల సమావేశం

Date : 12 June 2025 03:50 PM Views : 122

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ నగర పాలిక వార్డు ల విభజన శాస్త్రీయంగా లేదని..అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి జరిగిన పొరపాట్లను సరి చేయాలనీ మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు డిమాండ్ చేసారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు.శాస్త్రీయంగా మహబూబ్ నగర్ నగర పాలిక వార్డు ల విభజన చేయాలనీ కోరారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం తో ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో గెలిచేందుకు అవకాశం ఉన్న విధంగా అధికార పార్టీ ల నాయకులు కొత్త వార్డులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇదే విధంగా వార్డు ల విభజన చేస్తే భవిష్యత్ లో అభివృద్ధి కి ఆటంకం కలుగుతుందని అన్నారు. పెద్ద గ్రామ పంచాయతీ లు.. వార్డు లాపేరు కనుమరుగయ్యే విధంగా విభజన చేసారని పేర్కొన్నారు. స్థానిక ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కొత్త వార్డు ల ఏర్పాటు ఉందని తెలిపారు. అధికారులు సరి చేయకుంటే ప్రజాక్షేత్రం లోకి వెల్లి ప్రజలకు వాస్తవాలు వివరించి పోరాటం చేస్తామని పేర్కొన్నారు.పట్టణ అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ.. గతంలో వార్డు ల విభజన సమయంలో అందరూ ఒప్పుకున్న తరువాతే ఆమోదం తెలిపినట్టు చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అన్ని పక్షాల సలహాలు తీసుకున్న తరువాతే ముందుకు వెళ్లాలని అధికారులకి చెప్పిన విషయాన్నీ ఆయన గుర్తు చేసారు. ఒకదగ్గర కూర్చొని వార్డు ల విభజన చేయడం కాదని, అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని, సీనియర్ వార్డు మెంబెర్లతో సమావేశం పెట్టి వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. ఇదే రితిగా అధికారపార్టీ తీరు ఉంటే ఎన్నికల్లో తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని పేర్కొన్నారు. కొన్ని వార్డు లో ఎక్కువ ఓట్లు ఉన్నాయ్.. కొన్ని వార్డు లో ఎక్కువ ఉన్నాయని అన్నారు. చేస్తున్న పొరపాట్లను ఎత్తి చూపితే ప్రతిపక్షం నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పడం సరికాదని తెలిపారు. ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేష్, మాజీ కౌన్సిలర్స్ అనంతరెడ్డి, రామ్ లక్ష్మణ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, శరత్ చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :