Thursday, 08 January 2026 02:33:15 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

జాతీయ రహదారిపై దాబాలలో అక్రమ మద్యం సిట్టింగులు నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం... అదనపు ఎస్పీ నాగేంద్రుడు

Date : 23 June 2023 04:53 PM Views : 251

Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు జాతీయ రహదారి ఇరువైపులా ఉన్న దాబాలలో అక్రమ మద్యం సిటింగ్ లు నడిపిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని దాబాల యజమానులను అదనపు ఎస్పీ నాగేంద్రుడు హెచ్చరించారు. నారాయణపేట జిల్లా జాతీయ రహదారి 167 పై మరికల్ నుండి కృష్ణ బోర్డర్ వరకు రోడ్డు ఇరువైపులా ఉన్న దాబాలను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. జాతీయ రహదారి ఇరువైపులా ఉన్న దాబాలలో అక్రమ మద్యం సిటింగులు ఏర్పాటు చేసి వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు, రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా పలు దాబాలను తనిఖీ చేసి దాబాల యజమానులు అక్రమ మద్యం సిట్టింగ్లు ఏర్పాటు చేస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని దాబాలను సీజ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు గ్రామాల నుండి జాతీయ రహదారిని కలిపే రోడ్లకు స్పీడ్ బ్రేకర్స్, వైట్ పెయింట్ వేయించారా లేదా అని తనిఖీ నిర్వహించి జాతీయ రహదారిని కలిపి రోడ్ల దగ్గర ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్లు వేయించి వాటికి వైట్ పెయింట్ వేయించి వాహనదారులు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారిపై అవసరం ఉన్నచోట మలుపుల దగ్గర సైన్ బోర్డ్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు అయన సూచించారు. జాతీయ రహదారిపై వాహనాల వేగం 80 కిలోమీటర్ల దాటితే వాహనాలకు స్పీడ్ గన్ ద్వారా చాలెన్స్ విధించాలని పోలీసు అధికారులకు తెలిపారు. జాతీయ రహదారిపై వేగ నియంత్రణ కొరకు డ్రమ్స్ తో వేగ నియంత్రణ కొరకు రహదారిపై స్టాపర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండాలంటే ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని తెలిపారు. వాహనదారులు మితిమీరిన వేగంతో వాహనాలను నడపరాదని, రాష్ డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్, సీట్ బెల్ట్ విధిగా ధరించాలని వాహనాలకు సంబంధించిన పత్రాలు, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, టు వీలర్ వాహనాలు త్రిబుల్ రైడింగ్ చేయరాదని, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రహదారిపై సైన్ బోర్డ్స్ గమనిస్తూ వాహనాలు నడపాలని తెలిపారు.వాహనదారులు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యస్థానాలు చేరుకోవాలని రోడ్డు నిబంధనలు పాటించి పోలీస్ వారికి సహకరించాలని అదనపు ఎస్పీ తెలిపారు. అదనపు ఎస్పీ వెంబడి డీఎస్పీ కే.సత్యనారాయణ కృష్ణ ఎస్సై విజయ్ భాస్కర్ తదితర పోలీసు సిబ్బంది ఉన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :