Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తానని ఎన్నికలలో గెలిచేందుకు కాంగ్రెస్ ఉచిత హామీలతో కల్లబొళ్ళు మాటలు చెబుతుందని కాంగ్రెస్ పై మండి పడ్డాడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో అధికారం లేని కాంగ్రెస్ ఉచిత హామీలు ఇ వ్వడం ఏమిటని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే డబుల్ సర్కార్ తో నే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు.బిజెపి అభ్యర్థి మిథున్ కుమార్ రెడ్డి ప్రచారానికి బారి స్పందన లభిస్తోందని తెలిపారు. కేసీఆర్ కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్టులు అన్ని నాసిరకంగా ఉన్నయాని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.ప్రజలను భూటకపు మాటలు చెప్పి మోసం చేసి మరోసారి అధికారంలోకి రావడానికి భి ఆర్ ఎస్ ప్రయత్నిస్తుందని తెలిపారు.కారులో డీజిల్ కే లేని నాయకులు నేడు కోట్ల రూపాయలు సంపాదించారని మండిపడ్డాడు. ఎన్నికల్లో వారు ఇచ్చిన డబ్బు మద్యం తీసుకొని బిజెపి పార్టీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు ...
Admin
Abhi9 News