Saturday, 13 June 2026 04:59:46 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి ప్రజావాణి లో 96 దరఖాస్తుల స్వీకరణ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

Date : 09 June 2025 08:39 PM Views : 166

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా క‌లెక్ట‌రేట్ కార్యాలయం సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు లతో కలిసి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. అర్జీదారుల దరఖాస్తులలో పేర్కొన్న సమస్యల పై క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో 96 దరఖాస్తులు రాగా అందులో రెవెన్యూ,వ్యవసాయ శాఖ,పంచాయతీ రాజ్,ఇతర శాఖల కు సంబంధించి దరఖాస్తులు అందాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారుల సమన్వయ సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షా కాలంలో డెంగ్యూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు పారిశుధ్య చర్యలు తీసుకోవాలని,నీరు నిల్వ లేకుండా చూడాలని,త్రాగు నీటి వనరుల వద్ద పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు పంచాయతీ రాజ్ శాఖ పంచాయతీ కార్యదర్శులు,ఎం.పి. ఓ లను మండల ప్రత్యేక అధికారులు సమీక్షించాలని అన్నారు. పదిమంది కంటే ఎక్కువ ఉన్న పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులను పరిశీలించేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ లలో ఉన్న మహిళ సభ్యులలో కొత్తగా వచ్చిన వారి వివరాలు అప్డేట్ చేసి మహిళా,శిశు సంక్షేమ శాఖకు పంపించాలని ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎస్.సి.,ఎస్.టి.,బి.సి.,మైనార్టీ కార్పొరేషన్ ద్వారా యూనిట్ ల గురించి కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ లు సమావేశం జరిపి యూనిట్ ల కొనుగోలు సంబంధించి డి.పి.అర్ సమర్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జడ్.పి.సి. ఈ. ఓ వెంకట రెడ్డి,డి.అర్.డి. ఓ నర్సింహులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :