Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ నూతన సమీకృత భవనమును, ఎస్పీ కార్యాలయం పరిశీలన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితా,జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ సృజన... జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా కేంద్రం గద్వాల్ లో ఈనెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించనున్న సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం (ఐడిఓసి) లో ఏర్పాట్లు సత్వరం పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడిఓసి, ఎస్పీ నూతన భవనాలను మంత్రి పరిశీలించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. స్వాగత ఏర్పాట్లు, కలెక్టర్ ఛాంబర్, కాన్ఫరెన్స్ హాల్ ఇతర విభాగాలలో ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ఎస్పీ కార్యాలయాన్ని మంత్రి పరిశీలించి అక్కడి విభాగాలను అడిగి తెలుసుకున్నారు....
Admin
Abhi9 News