Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తమ నిరసన తెలియజేశారు... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మతోన్మాదాన్ని సృష్టిస్తూ కాలనీ గడుపుతున్నారని అన్నారు... దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని తెలిపారు... జరిగిన ఘటనపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ వైఖరి తెలియజేసినప్పటికీ కేసీఆర్ మాత్రం ఇంతవరకు నోరు విప్పక పోవడం బిజెపి పార్టీకి కొమ్ముకాస్తున్నట్టేనని పేర్కొన్నారు... ఇటువంటి సంఘటనలు మరోసారి జరిగితే దేశవ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు...
Admin
Abhi9 News