Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : భూ సమస్యల కొరకే భూభారతి ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. భూభారతి రెవెన్యూ సర్వే చివరి రోజు అయిన శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ కృష్ణ, మాగనూర్, తాసిల్దార్ కార్యాలయలలో, మున్సిపాలిటీ లో నిర్వహిస్తున్న స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. జిల్లాలో ప్రతి గ్రామపంచాయతీలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరిగిందని వాటిలో వచ్చిన అప్లికేషన్లను స్వీకరించి కేటగిరీల వారీగా నోటీసులు అందజేసి ఆర్. డి. ఓ. ఎమ్మార్వో స్థాయిలను ఉంటే పరిష్కరించస్తామని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 3500 అప్లికేషన్స్ వచ్చాయని తెలిపారు. గత నెల కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు గ్రామంలో నిర్వహించడం జరిగిందని వచ్చిన అప్లికేషన్స్లను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. మాగనూర్ తహసీల్దార్ కార్యాలయం లో వచ్చిన అప్లికిషన్స్ లను పరిశీలించారు. మగనూరు లో ఇప్పటివరకు ఎన్ని అప్లికిషన్స్ వచ్చాయని వాటిలో ఎన్ని పరిష్కరించారని తహసీల్దార్ ద్వారా తెలుసుకున్నారు. మండలం లో 264 అప్లికిషన్స్ వచ్చాయని వాటిలో 234 వరకు ఆర్డీవో, తహసీల్దార్ స్థాయిలో ఉన్నవాటిని పరిష్కరించడం జరిగిందని కలెక్టర్ కు తెలిపారు. పరిష్కరించాబడ్డ వాటిని ఎప్పటికి అప్పుడు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం కృష్ణ మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ భారతి లో ఎన్ని ఫీర్యాదులు అందాయి వాటిలో ఎన్ని పరిష్కరింప్పబడ్డాయి వాటి వివరాలను తెలుసుకున్నారు. కృష్ణ మండలం లోని కేజీబీవీ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి పాఠశాల లో విద్యార్థుల సంఖ్య ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థులు వచ్చారు అని యస్ ఓ ద్వారా తెలుసుకున్నారు. వంట గది ని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని పేర్కొన్నారు. ఫుడ్ కమిటీ తప్పనిసరి గా ఉండాలని ఉపాధ్యాయులలో ఒక్కరు భోజనం సమయం లో భోజనానికంటే ముందు భోజనం చేయాలని తప్పనిసరిగా రిజిస్టర్ మెంటైన్ చేయాలన్నారు. నీటి వృదా కాకుండా కుళాయిలను మరమ్మతు చేయాలన్నారు. విద్యార్థులకు వసతి గృహ లలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టి కి తీసుకొని రావాలని కలెక్టర్ తెలిపారు..........
Admin
Abhi9 News