Saturday, 18 April 2026 06:46:11 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం వెలుగు చూసింది. భాండప్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన జనాలపైకి దూసుక

Date : 30 December 2025 12:55 PM Views : 221

Abhi9 News - క్రైమ్ వార్తలు / : బస్టాండ్‌ వేచి ఉన్న ప్రయాణికుల మీదకు బస్సు దూసుకెళ్లి నలుగురు మరణించిన ఘటన ముంబై నగరంలో వెలుగు చూసింది. జనాలు తమ పనులు ముగించుకొని ఇంటికెళ్లేందుకు బస్సు కోసం బస్టాండ్‌లో వేచి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది వరకు గాయపడగా వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: ఈ సంఘటన సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగింది. ఉదయం పనులకు వెళ్లిన జనాలు తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌టో నిలబడి ఉన్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ బస్సు అదుపుతప్పి బస్టాండ్‌లోని జనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని.. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే గాయపడిన వారిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉందని. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :