Monday, 05 January 2026 04:30:58 PM
# అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. # కొత్త సర్పంచ్‌లకు సీఎం గుడ్ న్యూస్..

ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు

కొత్తగా పెళ్లైన ఓ జంట కేవలం 2 నెలల వ్యవధిలోనే రెండు రాష్ట్రాల్లో పోలీసులకు నిద్రలేకుండా చేశారు. హనీమూనిక వెళ్లిన ఈ జంట గొడవలతో తిరిగి సొంతూరు వచ్చారు.

Date : 29 December 2025 02:18 PM Views : 80

Abhi9 News - క్రైమ్ వార్తలు / : బెంగళూరులో కొత్త పెళ్లైన జంట వేర్వేరే చోట్ల ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణకు దారి తీసింది. హనీమూన్ ట్రిప్ సందర్భంగా భర్తతో గొడవపడి నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూశాయి. గురువారం (డిసెంబర్‌ 25) వధువు ఆత్మహత్య తర్వాత ఆమె భర్త కూడా ఓ హోటల్‌లో సూసైడ్ చేసుకున్నాడు. నాగ్‌పూర్‌లో అతని తల్లి కూడా ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ వ్యవహారం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. బెంగళూరులో రెండు నెలల క్రితం ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిగా ఉన్న సూరజ్‌ అనే వ్యక్తితో గణవి (26) అనే యువతితో వివాహం జరిగింది. అక్టోబర్ 29న గ్రాండ్ వివాహ రిసెప్షన్ కూడా జరిగింది. ఇందుకు వధువు తల్లిదండ్రులు దాదాపు రూ.40 లక్షలు ఖర్చు చేశారు. ఆ తర్వాత ఈ జంట 10 రోజుల క్రితం హనీమూన్‌కి శ్రీలంకకు వెళ్లారు. ఐతే అక్కడ ఈ జంట గొడవ పడటంతో ఐదు రోజుల్లోనే బెంగళూరుకు తిరిగి వచ్చారు. ఏం జరిగింతో తెలియదుగానీ నవ వధువు బుధవారం మధ్యాహ్నం అత్తింట్లో ఉరి వేసుకుని సూసైడ్‌ చేసుకుంది. గణవి సూసైడ్‌ తర్వాత ఆమె తల్లిదండ్రులు, బంధువులు అత్తింటి వారిపై వరకట్నం వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి నేరాల కింద కేసు పెట్టారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆమె భర్త కుటుంబం వేధింపుల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో కేసు నమోదైన తర్వాత మృతురాలి భర్త, అతని తల్లి జయంతి, సోదరుడితో కలిసి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు పారిపోయాడు. భార్య మరణించిన 2 రోజుల తర్వాత భర్త సూరజ్ శివన్న (36) శుక్రవారం నాగ్‌పూర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. శివన్న సూసైడ్‌ చేసుకున్న విషయాన్ని అతడి సోదరుడు సంజయ్ శివన్న నాగ్‌పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంతలో శివన్న తల్లి బంధువుల ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్తితి విషమంగా ఉంది. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :