Monday, 05 January 2026 04:29:27 PM
# అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. # కొత్త సర్పంచ్‌లకు సీఎం గుడ్ న్యూస్..

ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు..

అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తూ.. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.. తాజాగా.. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య.. భర్తను హత్

Date : 03 January 2026 05:18 PM Views : 39

Abhi9 News - క్రైమ్ వార్తలు / మెదక్ : అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి.. తాజాగా.. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. ఈ ఘటన తెలంగాణ మెదక్‌ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్‌లో జరిగింది. మద్యం మత్తులో ఉన్న భర్త స్వామి (35) ని చంపి.. చెరువులో పడి చనిపోయినట్టుగా నమ్మించేందుకు ప్రయత్నం చేసి.. అడ్డంగా దొరికింది.. విచారణలో భార్య మౌనిక అక్రమ సంబంధం బాగోతం బయటపడంతోపాటు.. స్కెచ్ వేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 23న నేరెళ్ల కుంటలో పడి బొల్లెబోయిన స్వామి మృతి చెందాడు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పలు కోణాల్లో విచారించి.. అతన్ని చంపింది.. భార్య మౌనిక, ఆమె ప్రియుడు సంపత్ గా తేల్చారు. వివరాల ప్రకారం.. 12 ఏళ్ల క్రితం స్వామి, మౌనికలకు పెళ్లి జరగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. మౌనిక (28) తనకంటే.. తక్కువ వయస్సున్న తిమ్మాపూర్‌ సంపత్ (23) తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తిమ్మాపూర్‌ సంపత్‌తో మౌనికకు అక్రమ సంబంధం భర్త స్వామికి తెలిసింది. దీంతో స్వామి భార్యతో గొడవపడ్డాడు.. దీనిపై పంచాయితీ పెడతానన్న భర్త స్వామి మౌనికకు చెప్పాడు.. ఈ క్రమంలోనే.. డిసెంబర్‌ 22న తాగి వచ్చి గొడవ చేశాడు.. అతడు నిద్రపోయిన తర్వాత ప్రియుడు సంపత్‌ను ఇంటికి పిలిచిన మౌనిక.. స్వామిపై దాడి చేసింది.. ఇద్దరూ కలిసి గొంతుకు చున్నీని బిగించి హత్య చేశారు.. అనంతరం మౌనిక సంపత్.. బైక్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లి.. నేరెళ్లకుంటలో పడేశారు.. ఆ తర్వాత.. మద్యం మత్తులో భర్త స్వామి చెరువులో పడి చనిపోయినట్టు మౌనిక నమ్మించింది.. తర్వాత మౌనిక, సంపత్‌ విషయం తెలిసి.. పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అన్ని విషయాలు బయటపడ్డాయి. తామే చంపినట్లు మౌనిక, సంపత్ ఒప్పుకున్నారు.. దీంతో మౌనిక, ఆమె ప్రియుడు సంపత్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :