Abhi9 News - క్రైమ్ వార్తలు / నారాయణపేట : నారాయణపేట జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. కొత్తపల్లి, బండగొండ గ్రామాల్లోని ఇళ్లపై దాడులు చేసి 110 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ వెల్లడించారు. నిందితులు శశివర్ధన్ నాయుడు, బాలకృష్ణ నాయుడుపై కేసులు నమోదు చేశారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
Admin
Abhi9 News