Thursday, 08 January 2026 02:52:10 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

విడాకులు ఇవ్వలేదనీ.. రోడ్డుపై వెంటాడి భార్యను హత్య చేసిన భర్త!

సూర్యరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతంలో భార్యను దారుణంగా హత్య చేశాడు విజయ్ అనే వ్యక్తి.

Date : 14 November 2025 03:57 PM Views : 117

Abhi9 News - క్రైమ్ వార్తలు / సూర్యాపేట : విజయవాడ సూర్యరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతంలో భార్యను దారుణంగా హత్య చేశాడు విజయ్ అనే వ్యక్తి. నూజివీడుకు చెందిన స్టాఫ్ నర్స్ సరస్వతి, విజయవాడకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ ఇద్దరు 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు సంతానం. ప్రస్తుతం రెండేళ్ల బాబుతో సరస్వతి వేరుగా నివాసం ఉంటుంది. 2022 ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున పెళ్లి చేసుకున్న ఇద్దరు కలకాలం జీవిస్తారని భావిస్తే.. పెళ్ళైన నెలల వ్యవధిలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీనితో దాదాపు ఏడాదిన్నర కాలంగా సరస్వతి, విజయ్ వేరుగా నివాసం ఉంటున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలతో సరస్వతి ఒంటరిగా నివాసం ఉంటున్న వేళ.. భర్త విజయ్ పై వేధింపుల కేసు పెట్టింది. దీనితో నూజివీడులో కేసు నమోదు కాగా 5 నెలల జైలుకు సైతం వెళ్లొచ్చాడు. దీనితో ఇద్దరి విబేధాలు తారస్థాయికి చేరాయి. చాలాకాలంగా భార్యను చంపుతానని బెదిరిస్తున్న విజయ్ గురువారం సరస్వతి పని చేస్తున్న వీన్స్ ఆసుపత్రికి వద్దకు వచ్చాడు. ఆ సమయంలో విధులు ముగించుకొని వస్తున్న భార్యను వెంటాడి వెంటాడి కత్తితో పొడిచి హత్య చేశాడు. వీన్స్ ఆసుపత్రి నుంచి పరిగెత్తి కత్తితో దాడి చేసిన విజయ్ ను నిలువరించేందుకు వెళ్ళిన స్థానికులను సైతం బెదిరించాడు. దీనితో సరస్వతిని కాపాడేందుకు వెళ్ళి ఏమి చేయలేక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు వచ్చి విజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. భార్య తనను వేధిస్తున్న కారణాలతో హత్య చేశానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు నిందితుడు విజయ్. వివాహేతర సంబంధం పెట్టుకొని కేసులు పెట్టీ తనని సరస్వతి వేధిస్తోందని తెలిపాడు. అరెస్టు చేయించడంతో పాటు విడాకులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న కారణంగా హత్య చేశానని విజయ్ పోలీసుల విచారణలో తెలిపాడే. హత్య చేశానన్న పశ్చాత్తాపం లేకుండా పోలీసులతో వాగ్వాదంకు దిగడంతో పాటు తాను చనిపోతానని బెదిరింపులకు దిగడం గమనార్హం. విజయ్ నుంచి కత్తిని స్వాధీనం చేసుకొన్న పోలీసులు నిందితుడిని స్టేషన్ కు తరలించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :