Thursday, 08 January 2026 03:10:06 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

సమోసా కోసం హత్య ..!

సమోసా కోసం ఏకంగా ఓ హత్య జరిగింది. ఓ వ్యక్తిని మహిళ కత్తితో కొట్టిమరీ చంపింది. ఈ విచిత్ర ఘటన బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో జరిగింది.

Date : 23 October 2025 11:51 AM Views : 86

Abhi9 News - క్రైమ్ వార్తలు / : ఘుమఘుమలాడే వేడివేడి సమోసా చూస్తే నోరూరని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. చల్లని సాయంత్రాల్లో చాలా మంది భోజన ప్రియులకు సమోసా బెస్ట్ చిరుతిండి. అయితే తాజాగా సమోసా కోసం ఏకంగా ఓ హత్య కూడా జరిగింది. ఈ విచిత్ర ఘటన బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో జరిగింది. ఆదివారం (అక్టోబర్‌ 19) సమోసాల విషయంలో ఏర్పడిన చిన్న వివాదం చిరిగి చిరిగి హత్యకు దారితీసింది. అసలింతకీ ఏం జరిగిందంటే.. బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో కౌలోదిహరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక దుకాణంలో సమోసాలు కొనడానికి వెళ్ళాడు. అయితే అతడు అక్కడున్న ఇతర కస్టమర్లతో అనుకోకుండా గొడవకు దిగాడు. దీంతో వారు అతడు కొనుగోలు చేసిన సమోసాల ప్యాకెట్‌ లాక్కోవడమే కాకుండా అతడిపై దాడి చేశారు. గమనించిన స్థానికంగా ఉండే చంద్రమ యాదవ్ అనే వ్యక్తి జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. వాగ్వాదం ఆపేందుకు చిన్న చర్చగా ప్రారంభమైన ఈ యవ్వారం చిరిగి చిరిగి గాలివానగా మారింది. దీంతో దుఖాణం వద్దకు చేరిన కొందరు గ్రామస్తుల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఇంతలో దుకాణం యజమాని అయిన ఓ మహిళ పదునైన కత్తితో చంద్రమ యాదవ్ తలపై కొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన అతడు రక్తస్రావంతో కుప్పకూలాడు. స్థానికులు అతడిని పాట్నాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం చంద్రమ యాదవ్‌ మరణించాడు. సమాచారం అందుకున్న భోజ్‌పూర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. చంద్రమ యాదవ్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళను సంఘటన జరిగిన కొద్దిసేపటికే అరెస్టు చేశారు. సమోసా విషయంలో జరిగిన చిన్న గొడవ ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ హత్యోదంతంలో ఇతరుల ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :