Abhi9 News - క్రైమ్ వార్తలు / కామారెడ్డి : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని జంగంపల్లి వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ ఓ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఉన్న 44వ జాతీయ రహదారిపై ఎలక్ట్రిక్ స్కూటీపై నలుగురు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొట్టింది. దీంతో మూడేళ్ల బాలుడు, మహిళ, వృద్ధుడు అక్కకక్కడే మృతి చెందగా, 6 నెలల పాప పరిస్థతి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాపను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Abhi9 News