Wednesday, 07 January 2026 08:49:26 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

గ్యాంగ్‌రేప్‌‌పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటనపై స్పందించిన బెంగాల్ సీఎం మమత బెనర్జీ విద్యార్థుల భద్రత కాలేజీ యాజమన్యాలేదనన్న దీదీ

Date : 12 October 2025 09:25 PM Views : 101

Abhi9 News - జాతీయ వార్తలు / : దుర్గాపూర్‌లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ఒడిశాకు చెందిన ఓ 23 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గతేడాది ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలోనే యువతిపై హత్యాచారం ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తాజాగా, ఈ ఘటనపై స్పందించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అర్ధరాత్రి విద్యార్థులు బయటకు వెళ్లడంపై ప్రశ్నించారు. ప్రైవేట్ కళాశాలలు విద్యార్థుల భద్రతను పూర్తిగా పర్యవేక్షించాలని ఆమె సూచించారు. పశ్చిమ్ బెంగాల్‌లో మరో వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. దుర్గాపూర్‌‌లో ప్రయివేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతోన్న 23 ఏళ్ల విద్యార్థిని శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో ఉండగా.. ముగ్గురు యువకులు అతడ్ని బెదిరించి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై బెంగాల్‌తో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తొలిసారి స్పందించారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఆమె బయటకు ఎందుకు వెళ్లారని దీదీ ప్రశ్నించారు. ప్రయివేట్ కాలేజీల్లో విద్యార్థుల భద్రత పూర్తిగా యాజమాన్యాలే వహించాలని పరోక్షంగా స్పష్టం చేశారు. ‘ఆమె ప్రయివేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది.. ఆమె అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో బయటకు వెళ్తే దీనికి బాధ్యత ఎవరిది?’ అని నిలదీశారు. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందన్న సీఎం మమత.. బెంగాల్ పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రయివేట్ మెడికల్ కాలేజీలు తమ విద్యార్థుల భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రి సమయంలో వారు బయటకు వెళ్లే విషయంలో పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ‘విద్యార్థులను బయటకు రావడానికి అనుమతించవద్దు’ అని బెనర్జీ అన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :