Wednesday, 07 January 2026 08:46:07 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

జైలులో ఫోన్లు మాట్లాడుతూ, టీవీలు చూస్తున్న ఖైదీలు!

అత్యాచారం, హత్య కేసుల నిందితుడు కూడా మొబైల్ వినియోగిస్తున్నట్లు వీడియోలు జైలులో వెలుగు చూసిన భద్రతా లోపాలు

Date : 08 November 2025 06:07 PM Views : 101

Abhi9 News - జాతీయ వార్తలు / : కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఖైదీలు నిబంధనలకు విరుద్ధంగా సరదాగా గడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడుతున్నారని, టీవీలు చూస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. శిక్షలు పడినప్పటికీ ఖైదీలు కొందరు నిబంధనలకు విరుద్ధంగా గడుపుతున్నట్లు సమాచారం. 1996-2022 మధ్య 20 మంది మహిళలపై అత్యాచారం చేసి, వారిలో 18 మందిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన ఉమేశ్ కు తొలుత కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, సుప్రీంకోర్టు దానిని 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా మార్పు చేసింది. ఇదే జైలులో ఉన్న ఉమేశ్ మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. జైలు లోపల రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు, ఒక కీప్యాడ్ మొబైల్‌ను ఉమేశ్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అతడిని ఉంచిన జైలు సెల్‌లో టీవీ కూడా ఉన్నట్లు సమాచారం. నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన తరుణ్ రాజు కూడా జైల్లో మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, అతడిని ఉంచిన సెల్‌లో వంట కూడా చేసుకుంటున్నాడని తెలుస్తోంది. పలువురు ఇతర ఖైదీలు కూడా మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం.వీటికి సంబంధించిన వీడియో క్లిప్స్ వైరల్ కావడంతో జైలులో భద్రతా లోపాలు వెలుగుచూశాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. దీనిపై దర్యాప్తునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :