Wednesday, 07 January 2026 08:47:33 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

వార్ మెమోరియల్ కళాఖండాలను శిల్పారామంలో తీర్చిదిద్దుతాం... కొరియా వార్ మెమోరియల్ ను సందర్శన అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్

Date : 04 July 2023 03:51 PM Views : 266

Abhi9 News - జాతీయ వార్తలు / మహబూబ్ నగర్ : ఆసియాలోనే ప్రఖ్యాతిగాంచిన దక్షిణ కొరియాలోని వార్ మెమోరియల్ ఆఫ్ కొరియాలో ఉన్న సైనిక కళాఖండాలను పోలిన విధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలోనూ పలు సైనిక కళాఖండాలను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి మంగళవారం నాడు ఆ దేశ రాజధాని సియోల్ లో ఉన్న వార్ మెమోరియల్ ఆఫ్ కొరియాను సందర్శించారు. 1950 యుద్ధ సమయంలో దక్షిణ కొరియాను రక్షించడంలో భారతదేశం చేసిన సహకారాన్ని గుర్తుచేసుకుంటూ ఆ దేశం ఏర్పాటు చేసిన స్మారక స్థూపాన్ని కూడా మంత్రి సందర్శించారు. 1994లో ప్రారంభించిన సైనిక మ్యూజియం ఆసియాలోనే అతిపెద్ద మ్యూజియం అని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ట్యాంకులు, యుద్ధనౌకలు మరియు ఆపరేషన్‌లో ఉపయోగించిన నిజమైన B-52 బాంబర్‌లతో సహా అనేక రకాల అరుదైన సైనిక కళాఖండాలను తాము తిలకించినట్లు వెల్లడించారు. ఎంతో ఆకట్టుకునేలా ఉన్న ఈ సైనిక మ్యూజియంలో ఉన్న పలు కళాఖండాలను పోలిన వాటిని మహబూబ్ నగర్ శిల్పారామంలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్, పర్యాటకశాఖ ఎం.డి మనోహర్, కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ తదితరులు ఉన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :