Saturday, 18 April 2026 07:04:53 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

వార్ మెమోరియల్ కళాఖండాలను శిల్పారామంలో తీర్చిదిద్దుతాం... కొరియా వార్ మెమోరియల్ ను సందర్శన అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్

Date : 04 July 2023 03:51 PM Views : 350

Abhi9 News - జాతీయ వార్తలు / మహబూబ్ నగర్ : ఆసియాలోనే ప్రఖ్యాతిగాంచిన దక్షిణ కొరియాలోని వార్ మెమోరియల్ ఆఫ్ కొరియాలో ఉన్న సైనిక కళాఖండాలను పోలిన విధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలోనూ పలు సైనిక కళాఖండాలను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి మంగళవారం నాడు ఆ దేశ రాజధాని సియోల్ లో ఉన్న వార్ మెమోరియల్ ఆఫ్ కొరియాను సందర్శించారు. 1950 యుద్ధ సమయంలో దక్షిణ కొరియాను రక్షించడంలో భారతదేశం చేసిన సహకారాన్ని గుర్తుచేసుకుంటూ ఆ దేశం ఏర్పాటు చేసిన స్మారక స్థూపాన్ని కూడా మంత్రి సందర్శించారు. 1994లో ప్రారంభించిన సైనిక మ్యూజియం ఆసియాలోనే అతిపెద్ద మ్యూజియం అని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ట్యాంకులు, యుద్ధనౌకలు మరియు ఆపరేషన్‌లో ఉపయోగించిన నిజమైన B-52 బాంబర్‌లతో సహా అనేక రకాల అరుదైన సైనిక కళాఖండాలను తాము తిలకించినట్లు వెల్లడించారు. ఎంతో ఆకట్టుకునేలా ఉన్న ఈ సైనిక మ్యూజియంలో ఉన్న పలు కళాఖండాలను పోలిన వాటిని మహబూబ్ నగర్ శిల్పారామంలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్, పర్యాటకశాఖ ఎం.డి మనోహర్, కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ తదితరులు ఉన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :