Wednesday, 07 January 2026 08:48:40 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు సర్.?

Date : 13 November 2025 10:25 AM Views : 114

Abhi9 News - ఆంధ్రప్రదేశ్ / శ్రీ సత్యసాయి ( పుట్టపర్తి ) : శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్.. రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? సత్య సాయి బాబా శతజయంతి వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ బైక్‌పై వెళ్లారు. ఆ బైక్ వెనుక సీటులోనే జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కూడా కూర్చున్నారు. అలా ఇద్దరు ఉన్నతాధికారులు బైక్‌పై చక్కర్లు కొట్టారు. కానీ బైక్ డ్రైవ్ చేస్తున్న కలెక్టర్ శ్యాంప్రసాద్ హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయారు. కనీసం వెనక కూర్చున్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అయినా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని గుర్తు చేయకపోవడం గమనార్హం. అలా పట్టణంలోని పలు ప్రాంతాలలో బైక్‌పై హెల్మెట్ పెట్టుకోకుండానే సత్య సాయి బాబా జయంతి వేడుకలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సూచించే జిల్లా ఉన్నతాధికారులే బైక్‌పై హెల్మెట్ పెట్టుకోకుండా తిరగడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ బైక్‌పై తిరుగుతున్న ఫోటోలు చూసి నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి అని చెబుతారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం మరణాలు జరుగుతున్నాయని చెప్పే జిల్లా కలెక్టర్, ఎస్పీలు. అదే నిబంధన స్వయంగా ఆ ఇద్దరు ఉన్నతాధికారులు పాటించకపోవడం కచ్చితంగా ప్రజలకు తప్పుడు మెసేజ్ ఇస్తున్నట్లే అవుతుందని అంటున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :