Wednesday, 07 January 2026 09:27:56 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

నిరుద్యోగులకు భారీ శుభవార్త

ప్రస్తుతం నాలుగు విద్యుత్‌ సంస్థల్లో 934 ఖాళీలున్నాయి. వాటితోపాటు మొత్తం మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ ..

Date : 22 September 2025 06:56 PM Views : 133

Abhi9 News - విద్య ఉద్యోగాలు / Hyderabad : తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు భారీ శుభవార్తను చెప్పింది. విద్యుత్ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఎస్పీడీసీఎల్, ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్, జెన్‌కో సంస్థల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో సంబంధం లేకుండా ఆయా సంస్థల నుంచి వేరువేరుగా జాబ్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.. అయితే, ప్రస్తుతం విద్యార్థుల ప్రయోజనార్థం కామన్ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం మూడు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం నాలుగు విద్యుత్‌ సంస్థల్లో 934 ఖాళీలున్నాయి. ఉత్తర తెలంగాణ డిస్కం(టీజీఎన్పీడీసీఎల్)లో 394, జెన్‌కోలో 283, దక్షిణ తెలంగాణ డిస్కం (టీజీఎస్పీడీసీఎల్)లో 135, ట్రాన్స్‌కోలో 122 పోస్టులు ఉన్నాయి. ఇవే కాకుండా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం చివరి దశకు వస్తుండటం, రామగుండంలో థర్మల్, ఇతర ప్రాంతాల్లో సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణ ప్రతిపాదనలు ఉండటంతో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ శాఖను ఉద్యోగ ఖాళీలు తీవ్రంగా వేధిస్తున్నాయి. కొన్నేళ్లుగా కిందిస్థాయి సిబ్బంది నియామకాలను చేపట్టడం లేదు. ముఖ్యంగా వానాకాలంలో సరిపడా సిబ్బంది అందుబాటులో లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం నాలుగు విద్యుత్ సంస్థల్లో 934 ఖాళీలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. అన్ని స్థాయిల కలిపితే మొత్తంగా రాష్ట్రంలో విద్యుత్ సంస్థల పరిధిలో దాదాపు 3వేలకుపైగా పోస్టులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎన్సీడీసీఎల్, జెన్ కో, ఎస్పీడీసీఎల్, ట్రాన్స్ కో సంస్థల్లో వేరువేరుగా నియామక పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీని వల్ల అభ్యర్థులు అన్ని పరీక్షలకు దరఖాస్తు చేసి రాస్తున్నారు. కొందరికి రెండు, మూడు సంస్థల్లో ఏకకాలంలో ఉద్యోగాలు వస్తుండగా.. ఏదో ఒక దానిలో చేరుతున్నారు. దీని వల్ల మిగతా ఉద్యోగాలు ఖాళీగా మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై నాలుగు సంస్థల్లో ఖాళీలకు సంబంధించి ఒకటే నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు సంస్థల్లో ఒకే సారి నోటిఫికేషన్ జారీ చేసి.. పరీక్షలను ఒకే సమయంలో నిర్వహించాలని నిర్ణయించింది.

abhi9 news

Admin

Abhi9 News

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :